ఫాస్టాగ్ లేని వాహనాలకు ఇకపై జాతీయ రహదారులపై డబుల్ టోల్ ఫీజు వసూలుచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. జాతీయ రహదారులపై తిరిగే వాహనాలకు గతేడాది డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
2020 మే వరకు దేశవ్యాప్తంగా 1.68 కోట్ల ఫాస్టాగ్లను ప్రభుత్వం మంజూరుచేసింది. కానీ, ఇంకా చాలావరకు వాహనాలు ఫాస్టాగ్ లేకుండానే హైవేలపై తిరుగుతున్నాయి. ఇకపై వాటికి డబుల్ టోల్ ఫీజు వసూలుచేయనున్నారు.
ఫాస్టాగ్ లేకున్నా లేదా సరిగా పనిచేయని ఫాస్టాగ్ ఉన్నా ఆ వాహనాలు టోల్ఫ్లాజా వద్ద ఫాస్టాగ్ లేన్లోకి ప్రవేశించరాదు. ఒకవేళ ఆ వాహనాలు ఫాస్టాగ్ లేన్లోకి వస్తే ఆ వాహనానికి టోల్ఫీజును రెండురెట్లు ఎక్కువగా వసూలుచేస్తారు.